18 July, 2026 | 12:36 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

దళిత బహుజన పార్టీ ర్యాలీ విజయవంతం చేయాలి

19-09-2025 07:59 PM

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): బీజేపీ, కాంగ్రెస్ ఇండియా వంటి మనువాద దోపిడీ మాఫియా కూటమి లకు రాజకీయం ప్రత్యామ్నాయంగా జాతీయ ప్రజాస్వామిక లౌకిక కూటమి ఎన్ డి ఎస్ ఎఫ్  ఏర్పాటు చేయడం జరిగిందని.. ఈ నెల 26న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగే ఆవిర్భావ మహా సభ.. ర్యాలీ లను విజయవంతం ఫ్రంట్ చైర్మన్, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు.

శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నాయత్యం లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు, కుల ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ తో సహా 11 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఫ్రంట్ తరుపున ఉమ్మడి గా పోటీ చేస్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బి ఆర్ ఎస్ అంతా ఒక్కటేనని వారి అజెండా కేవలం దళిత, బహుజన ప్రజలను సామాజిక అణిచివేసి దోపిడీ చేయడమేనన్నారు.