8 June, 2026 | 7:53 PM

Breaking News

మహర్రం సందర్భంగా భద్రత కల్పించాలని విజ్ఞప్తి   •   పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •  

70 గొర్రెలు మృత్యువాత

16-04-2025 12:15 AM

 నష్టపరిహారం ఇప్పిస్తాను ఎమ్మార్వో మాలతి 

నిజామాబాద్ ఏప్రిల్ 15 (విజయక్రాంతి):  నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హనుమాజీపేట గ్రామంలో 70 కి పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి.  కష్టపడి గొర్రెల పెంపకంతో జీవనం సాగించే తమకు కలిగిన నష్టాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. మంగళవారం ఎండ తాపానికి గురైన జీవాలు పంట పొలంలో నీరు తాగి ఈ కొద్దిసేపటికే ప్రాణాలు వదిలాయి.  70 కి  పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయని ఎమ్మార్వో బీమాలతి తెలిపారు.  గొర్రెల బీమా పథకం ఉంటే ఖచ్చితంగా సహాయం అందిస్తామని.  ప్రభుత్వ పరంగా కాపర్లను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

రైతులు ఎండాకాలం పంట పొలాల్లో జాగ్రత్తగా ఉండాలని పశువులు వేయడానికి వస్తూ ఉంటాయాని పంట కోసిన తర్వాత మోటార్ల వద్ద విద్యుత్ వైర్లు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని ఆమె రైతులకు సూచించారు. పశువులను పెంచుకునేవారు అడవిలో పంట పొలాల వద్ద మేపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాలతి పశువుల కాపరులకు సూచించారు. 

ఉన్నది పేట్ గ్రామానికి చెందిన గంప పెద్ద రాజయ్యకు చెందిన 70 గొర్రెలు గ్రామ శివారులో నీళ్లు తాగి మృత్యువాత పడ్డాయి పూర్తి వివరాలు తెలియాల్సిందని గొర్రెలకు ఇన్సూరెన్స్ ఉంటే క్లైమ్ అయ్యేలా చూస్తామని లేని పక్షంలో అధికారుల దృష్టికి నివేదించి నష్టపోయిన గంప పెద్దరాజయ్యకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మరో మారుతి తెలిపారు.