8 June, 2026 | 6:36 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

కమ్యూనిటీ హాల్‌ను అభివృద్ధి చేయాలి

16-04-2025 12:14 AM

ఎంపీ ఈటలను కలిసిన కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా 

ఎల్బీనగర్, ఏప్రిల్ 15 : దిల్‌సుఖ్ నగర్ లోని కమ్యూనిటీ హాల్ ను అభివృద్ధి చేయాలని స్థానికులు కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్తాతో కలిసి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు వినతి పత్రం అందజేశారు. న్యూ దిల్‌సుఖ్ నగర్ కాలనీవాసులు తమ కాలనీలో వివిధ సమస్యలతో పాటు కమ్యూనిటీ హాల్ అభివృద్ధి విషయంలో స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తాను కలిశారు.

నిధులు మంజూరు చేయాలని మంగ ళవారం ఎంపీ ఈటల రాజేందర్ ని కలిసి ప్రతిపాదనలను అందజేశారు. ఎంపీని కలిసినవారిలో న్యూ దిల్ సుఖ్ నగర్ కాలనీ అధ్యక్షుడు రాజేశ్వర్ రావు, సెక్రటరి పద్మిని, ట్రెజరర్ సుషిమిత, గోవింద్ రాజు, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు నవీన్ యాదవ్, వినోద్ యాదవ్ తదితరులు ఉన్నారు.