30-06-2025 02:02:22 AM
రాజేంద్రనగర్, జూన్ 29: బండ్లగూడ జాగీరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహిళా కమిటీ ఆధ్వర్యం లో ఆషాడం మాసం సందర్భంగా గో రింటాకు సంబరాల ఉత్సవం ఉదయం 10 గం టల నుండి మహిళలతో ఘనంగా నిర్వహించారు. సుమారు రెండు వందల మంది మ హిళలు పారాయణం, గోరింటాకు సంబరాలలో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. శాకాంబరి ఉత్సవంలో అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు.
ఎంతో విశిష్టమైన ధాన్యాధి నివాసంలోని వడ్లతో వచ్చిన బి య్యం తో అన్న ప్రసాదం వితరణ చేశారు. ఆ తర్వాత అమ్మవారికి అలంకరించిన శా కాంబరీ కూరగాయలు ఒక్కో కుటుంబానికి పాకెట్ చొప్పున పంపిణీ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు కార్యక్రమంలో పెద్ద ఎత్తునపాల్గొన్నారు.