calender_icon.png 30 June, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బలోపేతానికి అడుగులు

30-06-2025 02:01:27 AM

  1. 4న హైదరాబాద్‌కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే 
  2. ఎల్బీ స్టేడియంలో భారీ సభ 
  3. గ్రామశాఖ అధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యుల హాజరు

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్ఠానం కృషి చేస్తున్నది. తద్వారా త్వర లో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నిక ల్లో మెజార్టీ స్థానాలను చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నది. అందుకు అనుగుణంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే జిల్లా లు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ గా  సమీక్షలు, సమావేశాలు నిర్వహించా రు.

దీనిలో భాగంగానే జూలై 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గాల బాధ్యుల తో సమావేశం నిర్వహించనున్నది. సభ కు ఏఐసీసీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే హాజరుకానున్నారు. సభకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కూడా రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతున్నాయి. 

పీఏసీ, పీసీసీ విస్తృత సమావేశం

ఎల్బీ స్టేడియంలో నిర్వహించే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సభకు ముందే గాంధీభవన్‌లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ( పీఏసీ)  సమావేశం, పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.  ఈ సమావేశాల్లో నూ పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.

వరంగల్ విభేదాలను క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్

వరంగల్‌లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, పంచాయితీ వ్యవహారాన్ని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని, దానిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా  క్రమశిక్షను పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను అవలంబిస్తున్నదని, వాటిని ప్రజాస్వామికవాదులు, లౌకిక శక్తులు అడ్డుకోవాలన్నారు.

జీవితకాలం సెక్యులరిస్టుగా, నిబద్ధత ఉన్న నేత డీ శ్రీనివాస్ (డీఎస్) అని, అలాంటి గొప్ప నేత విగ్రహాన్ని బీజేపీ నేతతో ఆవిష్కరింపజేయడం శోచనీయమని పరోక్షంగా విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు డీఎస్ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజ కీయాల్లో తన గురువు డీఎస్ అని గుర్తుచేసుకున్నారు. డీఎస్ విగ్రహానికి స్థలం ఇచ్చింది రాష్ట్ర ప్రభు త్వమేనని, అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుల ఆహ్వా నం లేకపోవడం దారుణమన్నారు. డీఎస్ కాంగ్రెస్ నుంచి కొన్ని కారణాల వల్ల బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని, కొద్దికాలం తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారన్నారు. రాజధానిలో త్వరలో మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యం

జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్  పిలుపునిచ్చారు. అందుకు కాంగ్రెస్ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమం తరావుతో కలిసి గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలన్నారు. జూలై 4న ఎల్బీస్డేడియంలో జరిగే పార్టీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని, పార్టీ నేతలు సభకు భారీగా జన సమీకరణ చేయాలని సూచించారు.