calender_icon.png 23 July, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్‌షాక్‌తో 50 గొర్రెలు మృతి

23-07-2025 01:02:29 AM

బాధితుడిని పరామర్శించిన కాంగ్రెస్ ఇంచార్జి భీమ్ భరత్

చేవెళ్ల/మొయినాబాద్, జులై 22:కరెంట్ షాక్ తో 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బాధితుల వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడ గ్రామానికి చెందిన కోడ్చర్ల కుమార్ యాదవ్ 20 ఏళ్లు గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు 70 గొర్రెల ఉండగా ఎప్పటిలాగే సోమవారం గొర్రెలను మేపుకొచ్చి కొట్టంలో ఉంచాడు. కొట్టం గోడకు ఉ న్న మీటర్ వైరు తెగి రేకులకు తగటడంతో షార్ట్ సర్క్యూట్ వచ్చి గొర్రెలకు షాక్ కొట్టింది.

ఇం దులో 50 గొర్రెలు చనిపోయి దాదాపు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లింది. గొర్రెలు అమ్మి త న కూతురు పెళ్లి చేద్దామనుకున్నానని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి పామెన భీమ్ భరత్ ఘటనా స్థలానికి వెళ్లి బాధితుడిని పరామర్శించి.. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

వెంటనే తహసీల్దార్, విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి నష్ట పరిహారం ఇచ్చేందు కు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భీమ్ భరత్ వెంట మొయినాబాద్ మండల అ ధ్యక్షుడు మానయ్య , వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ గణేష్ గౌడ్, బాకారం మాజీ స ర్పంచ్ వెంకట్ రెడ్డి, నాగి రెడ్డి గూడ గ్రామానికి చెందిన సంజీవ రెడ్డి, మాణిక్యం , గ్రామ సీనియర్ నాయకులుఉన్నారు.