25-06-2025 11:42:38 PM
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ప్రభుత్వరంగ సంస్థల స్థాపన కోసం 1960లలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ రాయితీలతో కేంద్ర ప్రభుత్వానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూములు కేటాయించిందని, ఆయా భూములకు సంబంధించిన సమస్యలు సుదీర్ఘకాలం నుంచి పెండింగ్లోనే ఉన్నాయని, వాటికి పరిష్కారం చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు బుధవారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కోరారు.
ఈ మేరకు ఢిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. పారిశ్రామికాభివృద్ధి, యు వతకు ఉపాధి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో నాటి ప్రభుత్వం భూములు కేటాయించిందని వివరించారు. కాలక్రమంలో అనేక సంస్థలు మూత పడ్డాయని, మరికొన్ని సంస్థల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. ప్రస్తుతం ఆయా సంస్థల పరిధిలోని భూములన్నీ నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని వాణిజ్యపరంగా వినియోగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
భూముల వినియోగంపై ఎలాంటి ప్రణాళికలు ఆలోచనలేవీ కేంద్రం చేయలేదన్నారు. సదరు భూములను ఆయా కంపెనీలు ఇతరప్రైవేటు వ్యక్తులకు విక్రయించేందుకు యత్నిస్తున్నాయని, ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. అనంతరం భూములను రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇక ముందైనా రాష్ట్రానికి సరైన పరిహారం హామీ లేకుండా, ఆ భూములను ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, భూ ముల విషయ ంలో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి రా ష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు.