24-06-2025 01:15:27 AM
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన రూ.2 లక్షల చొప్పున రైతు రుణమాఫీ ఇప్పటికీ పూర్తిగా అమలవలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సుమారు 15,000 మంది అర్హులైన రైతులు ఉన్నప్పటికీ, వారి ఖాతా ల్లో నిధులు జమ చేయలేదని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు రూ.లక్షలోపు వ్యవసాయ రుణా లు తీసుకున్నప్పటికీ... ఇప్పటికీ వారికి రుణమాఫీ అమలు కాలే దన్నారు. ఈ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆయా బ్యాంకుల నుంచి స్పష్టమైన సమాచారాన్ని సేకరించి, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరారు. రాష్ర్ట ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రుణమాఫీ అమలు అంశాన్ని వేగవంతం చేయాలని ఎస్ఎల్బీసీలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
2013-14లో తెలంగాణలో వ్యవసాయ రుణాల మొత్తం రూ.27,676 కోట్లు కాగా.. నరేంద్రమోదీ నాయకత్వంలో అది 2024-25 నాటికి రూ.1,37,346 కోట్లకు పెరిగిందన్నారు. 11 ఏళ్లలో రుణాల కు అయిదు రెట్లు పెంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను దన్నుగా నిలుస్తోందన్నారు.
2014లో రాష్ర్టవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల బ్రాంచుల సంఖ్య 6,000గా ఉండగా, ఇప్పటివరకు దాదాపు 600 కొత్త బ్రాంచులు పెరిగాయని.. బ్యాంకింగ్ కరస్పాండెంట్ వ్యవస్థ రాష్ర్టంలో మరింత బలపడిందన్నారు. రాష్ర్టవ్యాప్తంగా 80,931 మంది బ్యాంక్ కరస్పాండెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువచేసేందుకు పని చేస్తున్నారని తెలిపారు.
రాష్ర్టంలోని వివిధ జిల్లాల్లో ఎస్బీఐ, యూబీఐ, కెనరా బ్యాక్ లీడ్ బ్యాంకులుగా పని చేస్తున్నాయని.. ఈ బ్యాంకులు జిల్లాస్థాయిలో కేంద్ర పథకాల అమలు, రుణాల పంపిణీ వంటి ముఖ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయని చెప్పారు. ప్రజలకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంపొందించేందుకు నిరంతర కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముందన్నారు.
ముమ్మరంగా రుణ అవగాహన కార్యక్రమాలు..
విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు, గృహ నిర్మాణం కోసం హౌసింగ్ లోన్లు, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, స్వయం సహాయక బృందాలకు లోన్ల ఆలస్యం జరిగితే ఎలా ఫిర్యాదు చేయాలనే అంశాలపై స్పష్టమైన అవగాహన కార్యక్రమాలు తీసుకురావాలని సూచించినట్లు కిషన్రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో రుణ అవగాహన కార్యక్రమాలను రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా చేపట్టాలని చర్చించినట్టు తెలిపారు.
ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగంలో ఉన్న చిన్న వ్యాపారవేత్తలకు బ్యాంకులు అందించే రుణ సదుపాయాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, క్రాఫ్ట్ లోన్లు, టర్మ్ లోన్లు, వ్యవసాయ రుణాలు, డెయిరీ, పాల్ట్రీ రంగాలకు సంబంధించిన లోన్లు.. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని బ్యాంకర్లకు సూచించామన్నారు.
విశ్వకర్మ యోజన, ముద్రాయోజన, స్ట్రీట్ వెండర్ రుణ సౌకర్యాల వంటి పథకాలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలన్నారు. ప్రతీ బ్యాంకు బ్రాంచి యేటా కనీసం ఒక ఎస్సీ లేదా ఎస్టీ వ్యక్తికి, ఒక మహిళా ఋణగ్రహీతకు రుణం అందించాల్సిందిగా నిర్ధేశించామన్నారు. రా సమావేశంలో ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ పాల్గొన్నారు.