26-06-2025 08:22:25 AM
హైదరాబాద్: సూర్యాపేట జిల్లా(Suryapet District) కోదాడ బైపాస్ లోని దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి(Kodada Government Hospital) తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులను కోనసీమ జిల్లా ఆలమూరు ఎష్ఐ అశోక్, కానిస్టేబుల్ బ్లెసీన్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.