calender_icon.png 26 June, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో మొదలైన ఆషాఢ మాసం బోనాల సంబరాలు

26-06-2025 08:08:03 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాల(Telangana Bonalu) సంబరాలు గురువారం నుంచి మొదలయ్యాయి. నేటి నుంచి జులై 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా బోనాల జాతర కొనసాగనుంది. ఆషాడ శుద్ధ పాఢ్యమి తర్వాత వచ్చే తొలి గురు, ఆదివారాల్లో గోల్కొండ కోటలో బోనాలు నిర్వహిస్తారు. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి తొలి బోనంతో జాతర మొదలవుతుంది. సింహవాహిని అమ్మవారికి చివరి బోనం సమర్పించడంతో జాతర ముగుస్తుంది. జంట నగరాల్లో బోనాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రం ప్రభుత్వం రూ. 20 కోట్లు కేటాయించింది. బోనాల ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.