calender_icon.png 28 June, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

28-06-2025 05:22:50 PM

కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోని  విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాబోయేది వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు రాకుండా విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయి రెడ్డికి సూచించారు. చిన్న మల్లారెడ్డి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థులకు గణితం బోధించారు. విద్యార్థులచే బోర్డు మీద లెక్కలు చేయించారు.

పదవ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రతి విద్యార్థి ప్రత్యేక దృష్టి సాధించి  కష్టపడి చదవాలని సూచించారు. పాఠశాల మైదానం పరిశీలించి శారీరకంగా మానసికంగా, ఆరోగ్యంగా ఎదిగేందుకు చదువుతోపాటు ప్రతి విద్యార్థి క్రీడలలో తప్పక పాల్గొనాలని సూచించారు. ఉపాధ్యాయులు  పాఠశాల సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని, అలాగే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాఠశాల పరిసర ప్రాంతాలను,  టాయిలెట్స్ కూడా శుభ్రంగా ఉంచాలని  తెలిపారు. అలాగే పాఠశాలలోని అందరి విద్యా ర్థులు స్కూల్ యూనిఫామ్ ధరించాలని సూచించారు.