19-06-2025 12:11:36 AM
విజ్ఞప్తి చేసిన పాఠశాల నిర్వాహకులు
నారాయణపేట.జూన్ 18(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని ఉడ్మలగిద్ద గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి.. ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శిం చారు. పాఠశాలలో పెయింటింగ్ పనులు చేయించేందుకు సహకరించాలని పాఠశాల నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్ర మంలో ప్రధానోపాధ్యాయులు సంజీవ్, ఉపాధ్యాయులు చెన్నప్ప, వెంకటప్ప, ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, హన్మంతు ముదిరాజ్, నర్సింహనాయుడు, శివరాజ్, ఎం.సంతోష్, నందుకుమార్, వై.సంతోష్, సిబ్బందితో పాటు వందలాది మంది విద్యార్థినీ విద్యార్థులుపాల్గొన్నారు.