02-06-2025 12:00:00 AM
మార్కెట్ చైర్మన్ గంగయ్య
బోథ్, జూన్ 1 (విజయ క్రాంతి) : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని బోథ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగయ్య అన్నారు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల రిత్యా ఆదిలాబాద్ జిల్లాలో రైతులు విస్తృతంగా తెల్ల జొన్నలు సాగు, దిగుబడి పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరానికి 8 నుండి 14 క్వింటాలకు పెంచి పూర్తిస్థాయిలో జొన్నల కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క కు ఆదిలాబాద్ జిల్లా రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
జిల్లా వ్యాప్తంగా 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 18,971 మంది రైతుల వద్ద నుండి 55,2,724.50 క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృ ష్టించిందని తెలిపారు. దీనివల్ల అదిలాబాద్ జిల్లా రైతులు మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఆశా భావం వ్యక్తం చేశారు.
జొన్నల కొనుగోలు పూర్తయిన నేపథ్యంలో పదిరోజుల్లో జిల్లా వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కి ప్రత్యేకంగా విన్నవించామని రాబోవు పది పదిహేను రోజులలో జొన్నల డబ్బులు విడుదల అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, మాజీ ఎంపీటీసీ శేఖ రజియా బేగం నాజర్ అహ్మద్, సీనియర్ నాయకులుగాజుల పోతన్న తదితరులు పాల్గొన్నారు.