26-06-2025 10:08:00 PM
మంథని (విజయక్రాంతి): మంథని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగిన మంథని, ముత్తారం మండలాల సంస్థాగత ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC General Secretary Duddilla Srinu Babu)ను తెలంగాణ వక్స్ బోర్డు చైర్మన్ ఆజ్మతుల్లా హుస్సేన్ ను టీపీసీసీ పరిశీలకులు సంగీతం శ్రీనివాస్ లను మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ గురువారం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మంథని నియోజకవర్గంలో తన వంతు కృషి చేస్తానని సింగిల్ విండో చైర్మన్ తెలిపారు.