calender_icon.png 27 June, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్ రోకోకు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు

26-06-2025 10:11:55 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): హైదరాబాద్ లోని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను ఆమె నివాసంలో కలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడమే లక్ష్యంగా వచ్చే నెల జూలై పదిహేడు నాడు చేపట్టిన రైల్ రోకో కు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక పక్షాన సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది. బీసీల రాజ్యాధికారం కోసం కవితక్క గత సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రం అంతటా పర్యటిస్తూ బీసీలను ఎకం చేసే ప్రయత్నం చేస్తున్నారని‌ ఈ రాష్ట్రంలో కవిత నాయకత్వంలో బీసీల సమస్యలు పరిష్కారం జరుగుతాయని, రిజర్వేషన్ వస్తేనే బహుజన సమాజం ఉన్నతమైన స్థానంలో ఉంటారని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. వారి వెంట బిసి నాయకుడు పోన్నం అనిల్ గౌడ్ ఉన్నారు.