నేడే ఎస్ఐఆర్-పై అవగాహనకు 2కె రన్
18-06-2026 12:00 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ, జూన్ 17 (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లలో అవగాహన పెంచేందుకు గురువారం ఉదయం 7:00 గంటలకు 2కె రన్ నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఓటర్లలో అవగాహన కోసం చేపట్టే ఈ కార్యక్రమాన్ని హనుమకొండ అదాలత్ సర్కిల్ లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ వరకు 2కె రన్ సాగుతుందని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.






