05-02-2026 01:48:43 AM
జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిర్వహణ
50 వేల మంది విద్యార్థుల హాజరు
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): సుచిరిండియా ఫౌండేషన్ 33వ సర్ సీవీ రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో సుచిర్ఇండియా ఫౌండేషన్ అధినేత లయన్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 500 పైగా పాఠశాలల నుంచి 50వేల మం ది విద్యార్థులు పాల్గొన్నారు. 20 మందికి గోల్డ్ మెడల్స్, 20 మందికి నేషనల్ ర్యాంక్స్, 20 మందికి రాష్ట్రస్థాయి మెడల్స్, 450 మందికి జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చాయి. ఈ అవార్డులు బుధవారం విద్యార్థులకు రవీంద్రభారతిలో ప్రదానం చేశారు.
కార్యక్రమం లో ఏపీ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, సినీనటులు శ్రీకాంత్, శివాజీ రాజా, సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ చేతుల మీదుగా అందజేశారు. సినీనటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చా లా సంతోషంగా ఉందన్నారు. ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 33 సంవత్సరా లుగా ఈ మహాకార్యాన్ని లయన్ కిరణ్ నిర్వహించడం సంతోషంగా ఉన్నదన్నారు.