14 April, 2026 | 1:25 PM

Breaking News

గొప్ప అభ్యుదయ వాది డాక్టర్ బీఆర్ అంబేద్కర్   •   అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •  

అడ్వకేట్ హత్య.. న్యాయవ్యవస్థపై దాడి

05-02-2026 01:48 AM

పీసీసీ లీగల్ సెల్ ఆగ్రహం 

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): చేవెళ్లలో న్యాయవాది స్వప్న దారుణ హత్యను పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ గుండ్లపల్లి తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన రంగారెడ్డి జిల్లా కోర్ట్ ఆవరణలో మాట్లాడుతూ.. స్వప్న హత్య కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, అది న్యాయ వ్యవస్థపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. ప్రజల పక్షాన కోర్టుల్లో వాదించే న్యాయవాదులకే రక్షణ లేకపోవడం దురదృష్టకరమని, ఒక మహిళా అడ్వకేట్‌ను హత్య చేయటం  సమాజం విఫలమైందనడానికి నిదర్శనమని మండిపడ్డారు.

రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం తక్షణమే  అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ను  తీసుకురావాలని, తద్వారా న్యాయవాదులకు వృత్తిపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్వప్న హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి, నిందితులకు ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ దేవులపల్లి సంతోష్ కుమార్, కన్వీనర్ పీఆర్‌వీ ప్రసాద్, సభ్యులు ఎం. సత్యనారాయణ, ఎస్. లక్ష్మయ్య, రమ్య, జీవన్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.