calender_icon.png 19 June, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ కబ్జా కేసులో ఆరుగురు అరెస్ట్..

18-06-2025 10:54:47 PM

కేసులో బీజేపీ, బీ.ఆర్.ఎస్ నేతలు...

వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ ఫణిధర్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఓ మహిళకు సంబంధించిన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా ప్రయత్నం చేసిన 15 మందిపై కేసు నమోదు చేయగా, ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు అదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్(Adilabad Rural CI Phanidhar) తెలిపారు. 1979 సంవత్సరంలో గడ్డం యాదవ రావు అనే వ్యక్తికి సంబంధించిన అనుకుంట గ్రామంలోని సర్వే నెంబర్ 7/1 లోని ఐదు ఎకరాల 10 గుంటల స్థలాన్ని కళావతి బాయి అనే మహిళ కొనుగోలు చేస్తుంది. అనంతరం కళావతి బాయి 2020 సంవత్సరంలో తన వదిన అయినా గైదాని లతా వామన్ రావుకు అమ్ముతుంది.

ఈ స్థలాన్ని ఎలాగైనా కబ్జా చేయలనే దురుద్దేశంతో ఆదిలాబాద్ లోని ముగ్గురు వ్యక్తులు సాజిదోద్దీన్, అదినాథ్, పత్తి ముజ్జు అనే వారు తమ బినామీల సహకారంతో నకిలీ పత్రాలు సృష్టించి యాదవ రావు వారసుల ద్వారా అ భూమిని కొనుగోలు చేసినట్టు సేల్ అగ్రిమెంట్ దస్తా వేజులు తయారు చేశారు.

బాధితురాలని బెదిరించి స్థలం నుండి వెళ్లగొట్టాలని ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాధితురాలు గైదాని లతా వామన్ రావు రూరల్ పోలీస్ స్టేషన్ లో తన భూమిపై అక్రమంగా పత్రాలు సృష్టించి తనను వేధిస్తున్నాడని భూమి నుండి వెళ్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్రైమ్ నెంబర్ 195/25తో కేసు నమోదు చేసి విచారించడం జరుగుతుందని సీఐ తెలిపారు. కాగా బుధవారం సాజిదోద్దీన్, అదినాథ్, చింతకుంట్ల సురేష్, సోంజోకి మోహన్ లాల్, షేక్ వహీద్, సయ్యద్ యహియా అరెస్ట్ చేయగా, మిగితా పత్తి ముజ్జు, షేక్ అబిద్ షేక్ నూర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.