calender_icon.png 8 June, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెల్ఫీ సరదాతో ఆరుగురు యువకులు మృతి..

07-06-2025 11:23:26 PM

అంబటిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం..

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): సెల్ఫీ సరదాతో గోదావరిలో మునిగి ఆరుగురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో పెళ్లి వేడుకలకు వచ్చిన యువకులు అంబటిపల్లి గ్రామానికి చెందిన యువకులతో కలిసి ఆటోలో మేడిగడ్డ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం గోదావరిలో సరదాగా ఈత కొడుతున్నారు. ఏడుగురు యువకులు గోదావరిలో ఈత కొడుతూ ఒకరు గోదావరి ఒడ్డుపై ఉండి ఈత కొడుతున్న యువకులను యొక్క ఫోటోలను వీడియోలను చిత్రీకరిస్తూ యువకులను ప్రోత్సహించడంతో యువకులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఇంకా లోతుకు వెళ్లారు.

ఒకరి తర్వాత ఒకరు మునిగిపోవడం జరుగుతూ ఉండగా ఒక్క యువకుడు మాత్రం బయటికి వచ్చాడు. వెంటనే అప్రమత్తమైన యువకులు ఆటోలో వచ్చిన తమ తండ్రి వద్ద వెళ్లి విషయం తెలిపారు. వెంటనే వాళ్లు అంబటి పెళ్లిలో గ్రామంలో విషయం తెలియడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులు  గోదావరి వద్దకు చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చినారు. గల్లంతైన  యువకుల వివరాలు పత్తి మధుసూదన్ 18 సంవత్సరాలు. పత్తి శివ మనోజ్ 15 సంవత్సరాలు వీరిద్దరూ సహోదరులు, తొగరి రక్షిత్ 13 సంవత్సరాలు, కర్ణాల సాగర్ 16 సంవత్సరాలు, ఈ నలుగురు యువకులు అంబటిపల్లి గ్రామానికి చెందినవారు.

మిగతా ఇద్దరు మహా ముత్తారం మండలం కొర్లకుంట గ్రామం కి చెందిన పండు 18 సంవత్సరాలు రాహుల్ 19 సంవత్సరాలు ఈ ఆరుగురు యువకులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జిల్లా యంత్రాంగంను పోలీస్ శాఖను అప్రమత్తం చేయడంతో సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి నదిలో ఈత కొట్టడం సెల్ఫీలు తీయడం నిషేధిస్తూ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టీఎస్ దివాకర ఆదేశాలు జారీ చేశారు.