07-06-2025 11:27:00 PM
తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపల్(Tirumalagiri Municipal) కేంద్రంలోని ఫాతిమా స్కూల్ వద్ద టాటా ఏసీని లారీ వెనుక నుండి ఢీకొనగా తిరుమలగిరి మండల పరిధిలోని కోక్య నాయక్ తండకు చెందిన గుగులోత్ భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య ఒక బాబు, అమ్మాయి ఉన్నారని మృతుని భార్య పిటిషన్ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా హాస్పిటల్(Thungathurthy Area Hospital) తరలించామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.