01-06-2025 12:00:00 AM
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ సిని మా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రచారంలో ఉన్న ఈ మూవీ సన్ పిక్చర్స్ పతాకంపై భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేవలం అనౌన్స్మెంట్ వీడియోతోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని, దాదాపు ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని ఇప్పటికే బజ్ నడుస్తోంది.
అల్లు అర్జున్ నటిస్తున్న ఈ 22వ సినిమాపై లేటెస్ట్ గాసిప్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. సినిమాలో ప్రీ-క్లుమైక్స్ లో ఊహించని మెగా ట్విస్ట్ ఉంటుందట! మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో దాదాపు ఐదు నిమిషాల పాటు స్క్రీన్పై కనిపించనున్నారట. చిరు క్యామియో ఈ సినిమాకు బిగ్ హైలైట్గా నిలువనుందంటున్నారు.
అట్లీ- బన్నీ కలిసి చిరుని ఈ ప్రత్యేక పాత్ర కోసం ఒప్పించారని ఫిల్మ్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ని షేక్ చేయడం ఖాయమంటున్నారు అభిమానులు. చిరు ఎంట్రీతో సినిమా రేంజ్ మరో లెవెల్కి వెళ్లిపోతుందని, ఇది ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ అవుతుందన్న టాక్ జోరుగా వినిపిస్తున్నాయి.