09-06-2025 02:38:11 AM
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్ల కోసం నిర్వహించే తెలంగాణ ఐసెట్-2025 తొలిరోజు రెండు విడతల పరీక్షను సజావుగా నిర్వహించినట్టు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అలువాల రవి తెలిపారు. మొదటి విడత ప్రశ్నపత్రాల సెట్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొ.ఇటికాల పురుషోత్తం, ప్రొ.మహమూద్, సెక్రటరీ శ్రీరా మ్ వెంకటేశ్, ఐసెట్ చైర్మన్ ప్రొ. హుస్సేన్లతో కలిసి అలువాల రవి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రొ.బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ఎంజీయూ అనతికాలంలోనే రాష్ట్ర స్థాయి కామన్ ఎంట్రన్స్లను నిర్వహించే సామర్థ్యం పొందడం హర్షించదగ్గ విషయమన్నారు. అభ్యర్థులకు, యాజమాన్యం రీత్యా అత్యంత పారదర్శకంగా, సులువుగా నిర్వహించేందుకు అధునాతన సాంకేతికతను వినియో గించడాన్ని అభినందించారు.
మొత్తం మూడు విడతల్లో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్షలను ఉద యం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు 93 పరీక్షా కేంద్రాల్లో, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వర కు 91 పరీక్షా కేంద్రాల్లో రెండు విడతలుగా నిర్వహించారు. మొదటి విడత 24,330 మంది అభ్యర్థులకుగానూ 21,897(90%) హాజరుకాగా, మధ్యాహ్నం 24,330 మందికి గానూ 22,136(90.98%) హాజరైనట్టు రవి వెల్లడించారు.