calender_icon.png 24 June, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక తనిఖీ ప్రజావేదిక

23-06-2025 07:48:16 PM

మహాదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలంలో 2024-25 సంవత్సర కాలంలో మండలంలోని 18 గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన వివిధ పనుల కొరకు నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి బాలకృష్ణ(Rural Development Officer Balakrishna) పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సంవత్సరం జరిగిన పనులకు చేసిన చెల్లింపులు రూ. 4,65,62,098 వేతనాలు రూపంలో రూ.3,32,24,593లు, మెటీరియల్ రూపంలో రూ.1,33,37, 505లను చెల్లింపులు చేయడం జరిగిందని మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ చెల్లింపులు చేసిన డాక్యుమెంట్లు పూర్తిగా ఆడిట్ బృందానికి అప్పగించగా  గ్రామాలలో తనిఖీ బృందం వారం రోజులపాటు గ్రామాల్లో తిరుగుతూ డాక్యుమెంట్లలో, ఏంబిలలో నమోదుచేసిన కొలతలను సరి చూసినారు. వివిధ గ్రామాల్లోని పని జరిగిన ప్రదేశంలో తనిఖీ బృందం సందర్శించి తనిఖీలో అవకతవకలకును గుర్తించారు. ఈరోజు మండల కేంద్రంలో  సామాజిక ప్రజా వేదికలో తనిఖీ బృందం తాము పరిశీలించిన లోటుపాట్లను చదివి వినిపించగా ప్రొసీడింగ్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పెనాలిటీ, రికవరీ కొరకు రూ. 30219/- విధించినట్లు తెలిపారు.

ఈ అవకతవకలలో బాధ్యులయిన సిబ్బందికి 15 రోజులలోగా నోటీసులు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కార్యాలయం నుండి జారీ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి తెలిపారు. ఈ ప్రజా వేదిక  కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ ఇంచార్జి అధికారి రూబీ నా బేగం, క్వాలిటీ కంట్రోల్ విభాగం ధరం సింగ్, అంబుడ్స్ మెన్ శ్రీనివాస్ అదనపు కార్యక్రమాదికారి రమేష్, సునీత, సోషల్ ఆడిట్ స్టేట్ టీం మేనేజర్ అజయ్, స్టేట్ రిసోర్స్ పర్సన్ గంగరాజు, వివిధ గ్రామపంచాయతీల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, జూనియర్ ఇంజనీర్, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొనడం జరిగింది.