23-06-2025 07:43:23 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ ద్వారా యూపీపిఎస్సి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి జాదవ్ అంబాజీ నాయక్(District Officer Jadhav Ambaji Naik) తెలిపారు. యూపిపిఎస్సి పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వచ్చే నెల 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారిలో ఉత్తమ వారిని ఎంపిక చేసి హైదరాబాదులోని రాజేంద్రనగర్ సీనియర్ ఐఏఎస్ కోచింగ్ కేంద్రాలు ఉచిత శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కార్యాలయంలో గాని లేదా 6281766564 ఫోన్ నెంబర్లు సంప్రదించాలన్నారు.