calender_icon.png 23 June, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటితో రైతు భరోసా నిధుల విడుదల పూర్తి: మంత్రి తుమ్మల

23-06-2025 07:49:52 PM

హైదరాబాద్: ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే రైతు భరోసా నిధులు(Farmer Assurance Funds) జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Agriculture Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. వానాకాలం సీజన్(Rainy Season)కు సంబంధించి ఈ పథకం కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం నిధులు పంపిణీ కొనసాగుతోంది. జూన్ 16 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.8,284 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపారు. 

సాగులో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా నిధుల విడుదల రేపటి వరకు పూర్తవుతుందని మంత్రి తుమ్మల వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి తక్కువ వ్యవధిలో నిధుల జమ చేశామన్నారు. తొలి రోజు రెండు ఎకరాలు, ఆ తర్వాత మూడు ఎకరాలు, నాలుగు ఎకరాలు, ఇప్పటికే 9 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. తాజాగా.. 15 ఎకరాల లోపు ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన విడుదల చేశారు.