calender_icon.png 10 June, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం

09-06-2025 09:50:21 PM

యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్..

సూర్యాపేట (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్(Youth Congress District President Elimineti Abhinay) అన్నారు. సోమవారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ల ఆదేశాలతో జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎఐసిసి అధ్యక్షులు ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు మంత్రివర్గ సభ్యుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఎలిమినేటి అభినయ్ మాట్లాడుతూ... దేశ, రాష్ట్ర రాజకీయాల్లో సామాన్య కార్యకర్తలు, నాయకులకు కుల, మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నతమైన పదవులను కట్టబెట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలు, మతాల వారికి సమానమైన ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీ పాటించిన సామాజిక న్యాయం దేశ రాజకీయాలకు ఆదర్శంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ప్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మాజీ పార్లమెంటరి నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, చింతమళ్ళ రమేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్యసుధీర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జవహార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ చారి, వివిధ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.