30-06-2025 12:02:18 AM
పైకం ఇవ్వకుండా జాప్యం
బ్యాంకు మేనేజర్ తీరుపై మహిళ ఆగ్రహం
టేకులపల్లి, జూన్ 29 (విజయ క్రాంతి) భర్త చనిపోయి పు ట్టెడు దుఃఖంలో ఉన్న ఓ మహిళను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం బొమ్మనపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ భీమా సొమ్ము ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వైనం ఆదివారం వెలుగు చూసింది. బాధితురాలు పెద గొని నాగమణి తెలిపిన వివరాల ప్రకారం... తన భర్త రవి ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు.
భర్తకు రూ 2 లక్షల ఇన్సూరెన్స్ రావాల్సి ఉందని ఆమె తెలిపారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ నిమిత్తం అవసరమైన అన్ని దృవీకరణ పత్రాలను బ్యాంకు మేనేజర్, ఫీల్ ఆఫీసర్ సమర్పించాలని తెలిపారు అన్నారు. వాటితో పాటు డ్వాక్రా లోన్ ఉందని, లోను పూర్తిగా చెల్లిస్తేనే ఇన్సూరెన్స్ ఇస్తామని మేనేజర్ చెప్పడం జరిగిందన్నారు. ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పినప్పటికీ మేనేజర్ వినకపోవడంతో గత నెల 3వ తేదీన తనకు వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుల నుంచి డ్వాక్రా రుణం రూ 50 వేలు తీసుకోవాల్సిందిగా లిఖితపూర్వకంగా లేక ఇచ్చినట్లు తెలిపారు.
బ్యాంకు మేనేజర్ కోరిన అన్ని డాక్యుమెంట్లను కలర్ జిరాక్స్ రూపంలో సమర్పించడం జరిగిందన్నారు. డాక్యుమెంట్ను పరిశీలించిన అధికారి వాటిని తీసుకోకుండా తిరిగి ఇచ్చి పంపాడని ఆమె తెలిపారు. తాను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి డాక్యుమెంట్లు ఇవ్వాలని చెప్పడంతో వెళ్లి పోయానన్నారు.
రెండు మూడు రోజులైనా మేనేజర్ నుంచి పిలుపు రాకపోవడంతో బ్యాంకుకు వచ్చిన ప్రతిసారి రేపు రా, ఎల్లుండి రా అంటూ తిప్పుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులను బ్యాంకు అధికారులు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ తిప్పుతు న్నా రని ఆరోపించారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరుతున్నారు.