calender_icon.png 8 June, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక తెలంగాణ ఎప్పటికి?

01-06-2025 12:00:00 AM

ప్రత్యేక రాష్ట్రం సాధించుకొని పుష్కర కాలమైంది. కానీ, తెలంగాణ సిద్ధాంత కర్త ఆశయం మాత్రం నెరవేరలేదు. అధికార మార్పిడి జరిగింది. పదవులు పంచుకుంటున్నారే తప్ప, ఆయ న ఆలోచనలను పట్టించుకుంటున్న పాపా న పోతలేరు. అందుకు వారు వీరు అనే తేడా ఏమీ లేదు. అందరూ ఆ తాసు ము క్కలే అని నిరూపించుకుంటున్నారు.

ఆరు దశాబ్దాల కింద మొదలైన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తర్వాత ఎన్నోసార్లు సామాజిక తెలంగాణ నినాదం ఎత్తుకున్నా అది అప్ప టి వరకే అన్నట్టు అయింది. సమయానికి అనుగుణంగా మాత్రమే వాడుకొని వదిలేస్తున్నారు. సామాజిక నినాదంతో ఏకంగా పార్టీలే పుట్టుకొచ్చినప్పటికీ చివరిదాకా నిలబడలేదు. నినాదాన్ని నిలబెట్టలేదు. ఇప్పటికీ సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.

స్థానికులకు అన్యాయం జరుగుతుందనే ఆవేదనతో మొదలైన ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ అరవై ఏళ్లకు నెరవేరింది. మధ్యమధ్యలో నాయకత్వాలు మారాయి. విరా మం వచ్చింది. కానీ, ఆకాంక్ష మాత్రం ఎప్పటికీ చల్లారలేదు. సమయానుకూలంగా ఎప్పటి కప్పుడు రగులుతూనే ఉం ది. తొలిదశ ఉద్యమం నుంచి కీలక పాత్ర పోషించిన తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్, ‘ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడమే కాకుండా సామాజిక తెలంగాణ వస్తేనే అందరికీ న్యా యం జరుగుతుందని’ కలలు గన్నారు.

అందుకోసం అవకాశం వచ్చిన ప్రతిసారీ తన వాదనను బలంగా వినిపించారు. ఉద్యమకారులను ఆ వైపుగా సంసిద్ధం చేశా రు. రాష్ట్ర సాధన కోసం ఏ సందర్భాన్నీ ఆయన వదులుకోలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రమే ప్రాణంగా బతికారు. ఉద్యమానికి ఉపయోగ పడతారనుకున్న ఏ వ్యక్తిని, ఏ వేదికను వదులుకోలేదు.

ఆయ న బాటలో నడిచి సాధించుకున్న తెలంగాణలో మాత్రం వారి ఆకాంక్ష ‘ఒడవని ముచ్చటే’ అయింది. పరాయి పాలనలో తీవ్ర అన్యాయానికి గురైన తెలంగాణ సమా జం సొంత రాష్ట్రంలోనైనా విముక్తి పొందుతుం దనుకుంటే అది ఓ కలగానే మి గిలింది. ఇప్పటికీ పక్కా ఇల్లు, రేషన్ బియ్యం  కో సం ప్రజలు దీనంగా ఎ దురు చూస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

ప్రధాన పదవులు ఎవరికి?

సమాజంలో ఎవరు, ఎంతమంది ఉన్నారో.. ఆ లెక్కన సంపద, అధికార పం పిణి జరగాలన్నది జయశంకర్ సార్ ఆశ యం. కానీ, 2014లో తెలంగాణ ఏర్పడ్డ నాటినుంచి కూడా అలాంటి పరిస్థితి ఎప్పుడూ కనిపించనే లేదు. అట్టడుగు పదవుల నుంచి ఆమాత్యుల వరకు కూడా అ ధిక జనాభా వర్గాలకు అరకొరగానే ఇచ్చా రు. కేవలం రిజర్వు స్థానాల విషయంలో తప్పితే జనరల్ సీట్లలో మాత్రం అగ్రవర్ణాల నాయకులే అధికంగా తిష్ట వేసిన సం గతి అందరికీ తెలిసిందే.

దళిత ముఖ్యమం త్రి ముచ్చట అటుంచితే, జనాభాలో అత్య ల్ప సంఖ్యలో ఉన్న సామాజిక వర్గానికి అత్యధిక మంత్రి పదవులు వరించడం జ యశంకర్ సార్ ఆశయానికి తూట్లు పొడవడమే కదా! బలహీన వర్గాల ప్రజలు ఇం కా అధికారానికి దూరంగానే ఉంటున్నా రు. తూతూ మంత్రంగా పదవులు ఇచ్చి సరిపుచ్చుతున్నారు. రాజ్యాధికారం సంగ తి పక్కనపెడితే, కనీసం సామాజిక న్యాయం కూడా దక్కడం లేదు.

సామాజిక వర్గాల వారీ గా రిజర్వేషన్లు ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్, ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్ వంటి పదవులు మాత్రమే ఎం తోకొంత దక్కుతున్నాయి. మి గిలిన జనరల్ స్థానాల్లో బీసీలకు దక్కే వాటా నామ మాత్ర మే. ఇక ఎస్సీ, ఎస్టీలకు ఆ స్థానాలతో సంబంధమే లేదన్నట్టుగా ఉం టుంది వ్యవహారం. జనరల్ స్థానాల్లో తామూ పోటీ చేయవచ్చు అనే సోయి కూడా ఎస్సీ, ఎస్టీ వర్గాలలో లేకపోడం బా ధాకరమే. 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందితే బీసీలకు కనీస వాటా దక్కే అవకాశం ఉంది.

కేవలం ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ స్థానాలు వదిలేస్తే జనరల్ స్థానాల్లో జనాభా ప్రాతిప దికన ఎవరెన్ని స్థానాలు దక్కించుకున్నారంటే అగ్రవర్ణాలదే అగ్రతాంబూలం. తెలంగాణ శాసనసభలోని 119 స్థానాల్లో 19 ఎస్సీ, 12 ఎస్టీలకు కేటాయించబడ్డా యి. 88 స్థానాలు జనరల్ కేటగిరీకి చెందినవి.

అందులో కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే 42 స్థానాల్లో గెలిచారంటే, అసలు వారి జనాభా ఎంత? పొందిన వారి వాటా ఎంత? ఇది కేవలం అసెంబ్లీకి సంబంధించింది మాత్రమే. స్థానిక సంస్థలు, పంచాయతీల్లో వారి ఆధిపత్యం ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. అత్యల్ప జనాభా ఉన్న వెలమలు 13 స్థానాలు దక్కించుకున్నారు. దీన్నిబట్టే అధికారం ఎవరి చేతుల్లో ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. 

రిజర్వేషన్లే కీలకం

జనాభాలో అత్యధిక వాటా కలిగిన ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాల నుంచి కేవలం ఒక్కొక్కరు మాత్రమే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏముంటుంది? 2023లో కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేసిన కార్పొరేషన్, ఇతర నామినేటెడ్ పోస్టులు కూడా అత్యధికంగా ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టి, బహుజనులకు అరకొర పదవులు ఇవ్వడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. పొద్దున లేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా రిటీ వర్గాల కోసం పాటుపడతామని  ఉపన్యాసాలిచ్చే నేతలకు పదవుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు మతిమరుపు వస్తదో వారికే తెలియాలి. 

జయశంకర్ సార్ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ఆయన బృహత్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మాత్రం ఎందుకు మనసు రావడం లేదో మరి. రాజకీయ రిజర్వేషన్లు లేకపోతే బహుజనులు కేవలం పాలితులుగానే మిగిలి పోతారనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. 2020లో జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎన్నికల సరళిని పరిశీలిస్తే రిజర్వేషన్ల ప్రాముఖ్యం స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా జనాభా దామాషా ప్రకారం రిజర్వే షన్లు లేకపోతే అధిక జనాభా ఉన్న వర్గా లు ఏ విధంగా నష్టపోతాయనేది గుర్తెరిగి, దానిని సాధించుకోవడానికి బహుజనులు కృషి చేయాలి.

వ్యాసకర్త సెల్: 96180 68673


అమరవీరులను స్మరిస్తూ! హైదరాబాద్ రాజధానిగా 33 జిల్లాలతో 66.54 శాతం అక్షరాస్యతతో తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక వారసత్వం, చే నేత పరిశ్రమ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక గమనం, ఆకర్షణీ య చారిత్రక కట్టడాలు, విలక్షణ సాఫ్ట్‌వేర్ ఐటీ కంపెనీలకు కేం ద్రంగా విరాజిల్లుతున్నది. అనేక ప్రత్యేకతలతో విలక్షణ రీతిలో అభివృద్ధి పథంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ముందడుగు వేస్తున్నది.

భారత రాష్ట్రాల్లో 8వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ, తలసరి వార్షిక ఆదాయం 3.08 లక్షలు, 12.8 శాతం సగటు వార్షిక ఆభివృద్ధి రేటు, ఐటీ పరిశ్రమ ఊపు, పారిశ్రామిక ప్రగతి, వ్యవసాయం/ పండ్ల ఉత్పత్తు ల్లో ముందంజ, అపారమైన ఖనిజ సంపద, ప్రత్యేక సాంస్కృతిక కళలు (పేరిణ, కూచిపూడి, లంబాడీ, గుస్సాడీ నాట్యాలు), వారసత్వం, హస్తకళల కేంద్రం, వైవిధ్య భరిత పండుగలు (బతుకమ్మ, దసరా, సంక్రాంతి, బోనాలు, ఉగాది) వంటి అనేక ప్రత్యేకతలకు తెలంగాణ సొంతం.

రాష్ట్ర జంతువుగా జింక, రాష్ట్రపక్షిగా పాలపిట్ట, రాష్ట్రవృక్షంగా జమ్మిచెట్టు, రాష్ట్ర పువ్వుగా తంగేడు పువ్వును నిర్ణయించింది తొలి నూతన ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహి టోంబ్స్, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, మక్కా మసీదు, పైఘా టోంబ్స్, చౌమల్లా ప్యాలే స్, పురానా హవేలి, బాసర సరస్వతి దేవాలయం వంటి ప్రఖ్యా త చారిత్రాత్మక కట్టడాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయి.

తెలంగాణలో కన్వా, ఏటూర్‌నాగారం, పోచారం, ప్రాణహిత, కిన్నెర సాని, శివరాం, మంజీర వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నా యి. రేపు తెలంగాణ రాష్ట్రం 11వ అవతరణ వేడుకలను భవ్యం గా నిర్వహించుకుంటున్న వేళ అమరవీరులకు నివాళులు అర్పిద్దాం.

డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి