17-05-2025 12:10:38 AM
సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి రూపొందుతున్న తాజాచిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. రాజశ్యామల బ్యానర్పై మధు కాలిపు నిర్మిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. మురళి కథను అందించారు. మీనాక్షి గోసామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి తదితరులు వివిధ పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా హీరో సుమంత్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పే పనిని ప్రారంభించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సూపర్ నేచురల్ కథతో వస్తున్న ఈ సినిమాలో సుమంత సరికొత్త పాత్రలో కనిపించనున్నారని టీమ్ చెబుతోంది.