06-08-2025 12:00:00 AM
చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు భానోత్ ప్రసాద్
మందమర్రి, ఆగస్టు 5: రైతులు నానో యూరియా ఎరువులను వాడటం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగు పడుతుందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు భానోత్ ప్రసాద్ అన్నారు. మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీలో మంగళ వారం వ్యవసాయ శాఖ, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ సంయుక్తంగా పత్తి క్షేత్రాలలో నానో యూరియా, డీఏపి ఎరువుల పిచికారిపై రైతులకు డ్రోన్ పరికరంతో క్షేత్ర ప్రదర్శన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు నానో యూరియా, నానో డీఏపి ఎరువుల వినియోగంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి, నాణ్యతను మెరుగు పరుస్తుందని, గాలి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. నానో ఎరువులను బయోస్టిమ్యులెంట్స్, ఇతర వ్యవసాయ రసా యనాలతో కలపవచ్చని, నానో డీఏపి ద్రా ణంతో విత్తన శుద్ది వల్ల మెరుగైన అంకురోత్పత్తికి, విస్తృతమైన వేరు పెరుగు దలకు దారి తీస్తుందని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుందని,ఎరువులను నిల్వ చేయడం, రవాణా చేయడం సులభమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవ సాయ అధికారి కిరణ్మయి, విస్తరణ అధికారి ముత్యం తిరుపతి, ఇఫ్కో జిల్లా మేనేజర్ శ్రీధర్ , గ్రామ రైతులు రాచకొండ కమల మనోహర్ రావు, ఎండి ఫిరోజ్, ఎగుడ రాయమల్లు, శెట్టి రాయమల్లు పాల్గొన్నారు.