సింగరేణి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి
డిప్యూటీ సీఎం భట్టికి, మంత్రి శ్రీధర్బాబుకు విన్నపం
మంథని, జూన్18 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్కు చెందిన సింగరేణి నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించాలని సోమవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రగతిభవన్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రాష్ట్ర ఐటీ, భారీ పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును కలిసి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సింగరేణి అధికారులు తమను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అర్హులందరికీ వచ్చే విధంగా చూడాలని కోరారు. మంత్రులు వెంటనే స్పందించి సమస్యలను సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీటీసీ వనం రాంచందర్రావు, మాజీ సర్పంచ్ బీవీ స్వామిగౌడ్, నాయకులు బర్ల శ్రీనివాస్, తొగరి లింగయ్య, వీరగోని లక్ష్మణ్, పొన్నం సత్యనారాయణ గౌడ్, , మెడగొని రాంయందర్, శ్రీనివాస్ ఉన్నారు.






