calender_icon.png 15 June, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీసీ టెస్టు చాంపియన్‌గా సౌతాఫ్రికా

15-06-2025 12:45:03 AM

- 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ కైవసం

-సెంచరీతో జట్టును గెలిపించిన మార్కరమ్

లార్డ్స్, జూన్ 14: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌గా సౌతాఫ్రికా నిలిచింది. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో సఫారీలు 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. 213/2 స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో మూడు వి కెట్లు కోల్పోయి 83.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది.

మార్కరమ్ (136) అద్భుత శతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పో షించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 207 పరుగులు చేసింది. అయితే తొలి రెండు రోజులు బౌలర్లకు విపరీతంగా అనుకూలించిన పిచ్  మూ డో రోజు నుంచి బ్యాటర్లకు కాస్త అనుకూలంగా మారింది. సఫారీ బ్యాటర్లు మార్క రమ్, బవుమా పోరాట పటిమతో జట్టు ను గెలిపించారు. 1998లో సౌతాఫ్రికా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది.