10-06-2025 12:38:54 AM
చౌటుప్పల్, జూన్ 9 (విజయక్రాంతి): చౌటుప్పల పురపాలిక కేంద్రంలో శ్రీ బడుగు రామస్వామి కమలమ్మ ఫౌండేషన్ మరియు శ్రీ పాలకుర్ల శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాన దీప్తి పురస్కారములను చౌటుప్పల అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా జ్ఞాన దీప్తి పురస్కారములను అందజేశారు.
ఈ సందర్భంగా బడుగు రామస్వామి కమలం ఫౌండేషన్ చైర్మన్ బడుగు శ్రీరాములు, పాలకూర శివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ చైర్మన్ పాలకూర మురళి గౌడ్ మాట్లాడారు. దబ్బటి శేఖర్, అక్షయ, పోలోజు రాజు, వెంకటాచారి, పిల్లల తల్లిదండ్రులు, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.