15 June, 2026 | 8:05 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

పాదయాత్ర చేసే హనుమాన్ స్వాములకు ప్రత్యేక దర్శనం కల్పించాలి

11-05-2026 05:32 PM

 సుద్దాల గురుస్వామి ముత్యాల శ్రీనివాస్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): కొండగట్టు అంజన్న క్షేత్రానికి పాదయాత్రగా వెళ్లే హనుమాన్ మాలధారుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన గురుస్వామి ముత్యాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా హనుమాన్ జయంతి ఉత్సవాలకు సుల్తానాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు హనుమాన్ దీక్ష ధరించి, సుమారు వందల కిలోమీటర్ల దూరం కాలి నడకన కొండగట్టుకు చేరుకుంటారని తెలిపారు.

ఎండల తీవ్రత దృష్ట్యా, కఠిన నియమాలతో పాదయాత్ర చేయడం వల్ల భక్తుల కాళ్లకు బొబ్బలు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వందల కిలోమీటర్లు నడిచి అలసిపోయిన స్వాములు, కొండగట్టు చేరుకున్నాక గంటల తరబడి సామాన్య క్యూ లైన్లలో నిలబడటం చాలా కష్టతరంగా మారిందని అన్నారు. కావున, కేవలం పాదయాత్ర ద్వారా వచ్చే భక్తుల కోసం "ప్రత్యేక దర్శన లైన్" ఏర్పాటు చేసి, వారి భక్తికి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం మరియు దేవాదాయ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.