20-06-2025 11:09:52 PM
సంక్షేమ అధికారి డాక్టర్ భాస్కర్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంక్షేమ అధికారి డాక్టర్ భాస్కర్(Welfare Officer Dr. Bhaskar) అన్నారు. బాల రక్షన్ భవన్ లో జరిగిన సమావేశానికి డిసిపిఓ మహేష్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంక్షేమ అధికారి మాట్లాడుతూ... కోవిడ్-19 ద్వారా అనాధలైన ఏడుగురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను పోషకులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు వివరించారు.
విద్య, సామాజిక స్థితిగతులను మెరుగుపడేలా కృషి చేయాలి అన్నారు. అనాధలైన చిన్నారుల సంక్షేమం పూర్తిగా ప్రభుత్వమే చూస్తుందని వారికి ప్రతినెల స్పాన్సర్ షిప్ పథకం కింద నాలుగు వేల రూపాయలు, సంవత్సరానికి ఒకసారి 20000 రూపాయలు స్టేషనరీ పుస్తకాలు యూనిఫామ్ నిమిత్తం ప్రతి ఒక్కరికి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వీరి పర్యవేక్షణ డిసిపి ఆధ్వర్యంలో బాలల సంరక్షణ విభాగం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శ్రావణ్ కుమార్, చంద్రశేఖర్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.