21-06-2025 12:00:00 AM
నిర్మల్ జూన్ 20 (విజయక్రాంతి) : ఈనెల 23న జిల్లా క్రీడలు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేం ద్రంలో ఒలింపిక్ రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా అధికారి శ్రీకాం త్ రెడ్డి తెలిపారు. శుక్రవారం క్రీడల శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఒలింపిక్ రన్ విజయవంతం పై సమావేశం నిర్వహించి చర్చించారు ఈ రన్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులు విద్యార్థులు యువకులు పాల్గొనే లా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీ శ్రీధర్ రెడ్డి పేట అధ్యక్షులు శ్రీ బుక్య రమేష్, ప్రధాన కార్యదర్శి శ్రీ భోజన్నా, ఎస్జీఎఫ్ సెక్రటరీ రవీందర్ గౌడ్ మరియు పిడిలు ఎం.శ్రీనివాస్, రమణ రావు జూడో అధ్యక్షుడు సాయి కిరణ్, కార్యదర్శి శివ ప్రసాద్, కరాటే అసోసియే షన్ అధ్యక్షుడు చందుల స్వామి, వివిధ క్రీడా సంఘాల బాద్యులు పాల్గొన్నారు.