15 May, 2026 | 8:36 PM

Breaking News

యువతి యువకులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!   •   అక్రమ ఇసుక లారీ పట్టివేత   •   వరి ధాన్యం నిల్వ ప్రక్రియ సక్రమంగా చేపట్టాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు   •   డివైడర్ పై ప్రమాదకరంగా ఫ్లెక్సీలు   •   తెలంగాణ మోడల్ స్కూల్‌లో పీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం   •   బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి   •   సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి   •   బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •  

ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం

15-05-2026 08:03 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలములోని ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాల విస్తరణ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో అభివృద్ధి పనులు గురించి, అందచేస్తున సంక్షేమ పథకాలు అమలు గురించి గ్రామాలలో మరింత తీసుకెళ్లాలని సూచించారు.ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేసి అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు.అంతకుముందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైనటువంటి శ్రీధర్ గౌడ్ను మర్యాదపూర్వకంగా నాయకులు కార్యకర్తలు శాలువతో సన్మానించారు.