calender_icon.png 30 June, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారంగాపూర్ ఫ్యాక్టరీ తెరిపించండి

30-06-2025 02:31:16 AM

కేంద్ర మంత్రి అమిత్ షాకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి విజ్ఞప్తి 

నిజామాబాద్ జూన్ 29; (విజయక్రాంతి): సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ను పునరుద్ధరణ చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ మాత్రమే సహకార చక్కెర కర్మాగారం అని ఆయన తెలిపారు.

ఈ కర్మాగారం 19 58లో స్థాపించబడిందని 1962 నుండి ని రాటంకంగా పని చేసిందని ఎమ్మెల్యే తెలిపారు 2005 నుండి కార్యకలాపాలను ఉత్పత్తిని ఫ్యాక్టరీ నిలిపివేసిందని ఈ కర్మాగారం నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్ వద్ద 92.12 ఎకరాల భూమిలో ఉందని విద్యుత్ శక్తి నీరు రహదారి రైలు కనెక్టివిటీ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కలిగి ఉందని ఆయన అమిత్ షాకు తెలిపారు.

ఈ కర్మాగారం ఒక్క 1 250 ఈసీడి సామర్థ్యాన్ని కలిగి ఉందని దాని పూర్తి సామర్థ్యం ఒక లక్ష అరవై రెండు వేల 5 మీటర్ల అవసరమని 5000 ఎకరాలకు చెరుకు పొలాల నుండి చెరుకు ఉత్పత్తులను పొందచ్చని ఆయన తెలిపారు. డాక్టర్ జోన్ లో సగటు దిగుబడి ఎకరానికి 35 ఎంపీలుగా ఉందని ప్రస్తుతం ప్రాక్టీస్ జోన్ లో చేరుకు ప్రాంతం 200 ఎకరాలు సాగుదారులు గాయత్రి షుగర్ లిమిటెడ్ కామారెడ్డి యూనిట్కు చేరుకుని సరఫరా చేస్తున్నారని హోంమంత్రికి భూపతిరెడ్డి వివరించారు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ కి చెరుకు తరలించడం రైతులకు భారంగా మారిందన్నారు .

సహకార పరిశ్రమలు పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం 3000 కోట్ల రూపాయలను ప్రకటించినందున ఫ్యాక్టరీ జోన్ ప్రాంతంలో 5000 ఎకరాల వరకు చెరుకును పెంచడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని ఎన్సీఎస్‌ఎఫ్ ఫ్యాక్టరీని పునరుద్ధరించవచ్చని నీటిపారుదల చెరుకు హార్వెస్టర్లను రైతులకు మంజూరు చేయాలని చెరుకు ప్రాంతాన్ని దిగుబడిని మెరుగుపరచడానికి ప్రతిపాదించాలని ఆయన కోరారు .

ఫ్యాక్టరీ ప్రాంతాలలో సహా ఇతర ప్లాంట్ల డిస్టrilanu పంపించవచ్చు అన్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన సారంగాపూర్ నిజామాబాద్ కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ యొక్క పునర్జీవనం కోసం ప్రతిపాదనను నిజామాబాద్ జిల్లా వ్యవసాయ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి అమిత్ షాక్కు ఎమ్మెల్యే తెలిపారు.