calender_icon.png 30 May, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు.. గిరి ప్రదర్శన

12-05-2025 12:57:59 AM

యాదాద్రి భువనగిరి, మే 11 ( విజయ క్రాంతి ): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి పురస్కరించుకొని ఆదివారం నాడు స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యారాధన అనంతరం శ్రీ నరసింహ జయంతి మహోత్సవంలో భాగంగా ఉదయం మూలమంత్ర ఆసనములు శ్రీ లక్ష్మీ సూక్తి, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణలు  నిర్వహించారు.

అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించి స్వామి అమ్మవార్లకు సహస్ర కళాభిషేకం అత్యంత వైభవంగా ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, యాగ్నిక బృందం, వేద పండితులు, పారాయనీకులు, భక్తి శ్రద్ధతో నిర్వహించారు ఈ వేడుకలలో ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య జిల్లా కలెక్టర్ రావు ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఉపకార నిర్వహణ అధికారి ఇతర అధికారులు పాల్గొన్నారు.

గిరి ప్రదర్శనలో భాగంగా అఖిలభారత గో సేవ ఫౌండేషన్ వారు గోరక్షణ భూ రక్షణ పర్యావరణ రక్షణ ధర్మం కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 152 రోజులు 5158 కిలోమీటర్లు 14 రాష్ట్రాల గుండా ఒక చిన్న పుంగనూరి గోమాత తో పాదయాత్ర నిర్వహించారు.

అట్టి గోమాత 500 మంది గో భక్తులతో ఉదయం గిరి ప్రదర్శన నిర్వహించారు. అనేక పుణ్యక్షేత్రాల మీదుగా పాదయాత్ర చేసిన మహా మైమాన్వితమైన గోమాతతో గిరి ప్రదర్శనలో పాల్గొనుట ఎంతో ప్రత్యేకమైనది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్, బాలకృష్ణ గురు, ఐతరాములుతోపాటు గిరి ప్రదర్శనలో భక్తులు పాల్గొన్నారు.