మంథని లైన్ గడ్డ, బొక్కల వాగు కట్టపై ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం
చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి
మంథని,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమములో భాగంగా మంథని మున్సిపల్ చైర్ పర్సన్ ఒడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యములో సోమవారం మంథని మున్సిపల్ పరిధిలోని లైన్ గడ్డ, బొక్కల వాగు కట్టపై ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమములో ముండ్ల పొదలు తొలగించి మురికి కాలువలు, రోడ్లను శుభ్రం చేయించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతు ప్రజలు చెత్తను బయట పడి వేయకుండా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మా సానిటేషన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలక వర్గ సభ్యులు స్రవంతి మద్దికట్ల, ఎల్లంకి వంశీధర్, కాంగ్రెస్ నాయకులు జంబోజు సమ్మయ్య, హ ఎరుకల రమేష్, వేముల సమ్మయ్య, ప్రజలు పాల్గొన్నారు.




