12 July, 2026 | 4:16 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు

12-09-2024 12:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): దసరా, దీపావళి సందర్భంగా ద.మ.రైల్వే 24 ప్రత్యేక రైళ్లను నడుపనుంది. సికింద్రాబాద్ తిరుపతి మధ్య వచ్చే నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 6 రైళ్లు, తిరుపతి సికింద్రాబాద్ మధ్యన వచ్చే 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 6 రైళ్లను నడుపనున్నారు. ఈ రైళ్లు మహబూబ్ నగర్, గద్వాల, కర్నూలు, గుత్తి, కడప మీదుగా నడుస్తాయి. తిరుపతి శ్రీకాకుళం మధ్యన వచ్చే నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు, శ్రీకాకుళం తిరుపతి మధ్యన వచ్చే నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 12 రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.