16 April, 2026 | 3:55 PM

నిధులను అభివృద్ధి కోసం ఖర్చు చేయండి

16-04-2026 02:04 PM

డి ఎల్ పి వో లింగయ్య

ఖానాపూర్ (విజయక్రాంతి): ప్రభుత్వం పంచాయతీలకు ఇస్తున్న నిధులను అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని డివిజనల్ పంచాయతీ అధికారి లింగయ్య అన్నారు. బుధవారం ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి రైతు వేదిక భవనంలో ఖానాపూర్ ,కడం, పెంబి , దస్తురాబాద్, నాలుగు మండలాల సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలకు, ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి పంచాయతీలకు వచ్చే నిధులను ఏ విధంగా ఖర్చు చేయాలి అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓలు సిహెచ్ రత్నాకర్ రావు, అనిల్ కుమార్, రమేష్ రెడ్డి ,ఓ శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.