calender_icon.png 23 June, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

23-06-2025 01:56:49 AM

నిజాంబాద్ సీపీ సాయి చైతన్య 

నిజామాబాద్ జూన్ 22: (విజయ క్రాంతి): క్రీడలు సిబ్బంది ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయనినిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని పోలీస్ మైదానంలో అన్ని వివాహాలైన నిజామాబాద్ సబ్ డివిజన్ ఆర్మూర్ సబ్ డివిజన్ బోధన్ సబ్ డివిజన్ విభాగం వివిధ బ్రాంచీలకు హోంగారడ్స్ విభాగం మొదలగు విభాగాల మధ్య పోలీస్ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించారు.

క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన సీపీ సైజ్ చైతన్య మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ప్రజారక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తూ ఎంతో ఒత్తిళ్లకు గురవుతున్నారని స్పష్టం చేశారు.  విధి నిర్వహణలో బిజీగా ఉన్న పోలీసులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కి దోహదపడతాయని ఆయన అన్నారు వివిధ క్రీడల్లో పాల్గొన్న పోలీసులు అలసటను వదిలి తిరిగి చలాకిగా ఉద్యోగాల్లో రాణిస్తారని ఆయన అన్నారు.

ఉద్యోగ వృత్తిలో ఎంతో బిజీగా పోలీసులు గడుపుతారని జీవితంలో మానసిక ఒక్తుడులను తట్టుకోవడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణిస్తున్నారని ఆయన సిబ్బందిని పొగిడారు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ముందు గా ఉండాలని పోలీసులకు ఆయన సూచించారు రాబోయే రోజుల్లో క్రీడా పోటీలను నిజామాబాద్ కమిషనరేట్ నుంచి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ క్రికెట్ మ్యాచ్ రెండు రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని క్రీడాకారులు పోలీస్ సిబ్బంది అందరూ పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదన పోలీస్ కమిషనర్ అడ్మిన్ బసవరెడ్డి అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ రాంచందర్రావు నిజామాబాద్ ఏసీబీ రాజా వెంకటరెడ్డి బోధన్ ఎసిపి శ్రీనివాస్ ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర రెడ్డి సిఐలు ఆర్‌ఐలు ఎస్త్స్రలు ఆర్‌ఎస్‌ఐలు పోలీస్ సిబ్బంది అంత పాల్గొన్నారు.