30-12-2025 06:50:40 PM
డిఎస్పి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ తిరుమల,
కాటారం,(విజయక్రాంతి): శారీరక దృఢత్వానికి మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదపడతాయని కాటారం డిఎస్పి సూర్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో చింతకాని అడ్డరోడ్డు వద్ద క్రాస్ కంట్రీ పోటీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా పాల్గొన్న క్రీడాకారులను వారు అభినందించారు. జిల్లా ఆత్లేటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో సుమారు 200 మంది బాలబాలికలు పాల్గొన్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతకాని సమ్మయ్య, కార్యదర్శి పూతల సమ్మయ్య తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు వారు తెలిపారు.