30-07-2025 12:00:00 AM
పెద్దపల్లి, జూలై29 (విజయ క్రాంతి): జూలై 30, 31 తేదీలలో కేజీబీవీ లో ఇంటర్మీడియట్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి మంగళవారం ఒక ప్రకటనలో తె లిపారు.జిల్లాలో ఉన్న 8 కస్తుర్భా గాంధీ బా లిక విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ వివిధ కోర్సులకు, అంతర్గాం లో 10 బై.పి.సీ, జూలపల్లి లో 15 బై.పి.సి, మంథని ముత్తారం లో 16 సీఈసీ, 19 ఎం.పి.హెచ్.డబ్ల్యూ , ఓ దెల లో 18 ఎం.పి.సి , 27 బై.పి.సి, పాలకుర్తిలో 19 ఎం.ఎల్.టి, 19 బై.పి.సి , రామగిరి లో 10 ఎం.పి.సి, కంప్యూటర్ సైన్స్ 25, శ్రీ రాంపూర్ లో 20 సి.ఈ.సి, 2 ఎం.పి.హెచ్.డ బ్ల్యూ, సుల్తానాబాద్ లో 21 ఎం.పి.హెచ్.డ బ్ల్యూ సీట్లు ఖాళీగా ఉన్నాయని,ఆసక్తిగల వి ద్యార్థులు నేరుగా జూలై 30, 31న స్పాట్ అడ్మిషన్ పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.