29-07-2025 11:31:15 PM
వరంగల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో రెవెన్యూ శాఖలో ఆర్డీవోలుగా విధులు నిర్వహిస్తున్న 44 మంది ఆర్డీఓలకు అదనపు కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించినట్టు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ లోకేష్ కుమార్(Lokesh Kumar) ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి లభించినటువంటి ఆర్డీవోలలో వరంగల్ ఆర్డిఓగా విధులు నిర్వహిస్తున్న సత్యపాల్ రెడ్డికి అదనపు కలెక్టర్ గా పదోన్నతి లభించినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూ అధికారులు, మండల తాసిల్దరులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.