27-05-2025 01:03:33 AM
హనుమకొండ మే 26 (విజయ క్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్ పరిధిలోని హసన్ పర్తి శ్రీ బీరన్న ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బీరన్న కామరాతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు. తొలుత గొల్ల గొంగడి కప్పి ఘన స్వాగతం పలికిన గొల్ల కురుమ సోదరులు, గొల్ల కురుమ ఏర్పాటు చేసిన బోనాలను ఎత్తిన ఎమ్మెల్యే నాగరాజు.
హసన్ పర్తి లోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గొల్ల కురుమ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వీరన్న కామారాతి బోనాల పండుగలో పాల్గొని బోనమెత్తి, ఆలయంలో ప్రత్యేక పూజ స్వామి వారి ఆశీస్సులు పొందడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.
అలాగే గుడి కి వచ్చే కచ్చ రోడ్డుకు 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి, త్వరలోనే రోడ్డు నిర్మాణం చేసి విధంగా కృషి చేస్తానని గొల్ల కురుమ సోదరులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టిపిసిసి సభ్యులు నమ్మిండ్ల శ్రీనివాస్, ఆత్మకూరు ఏఎంసీ వైస్ చైర్మన్ తంగేళ్లపల్లి తిరుపతి, మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్,
కాంగ్రెస్ పార్టీ నాయకులు వీసం సురేందర్ రెడ్డి, ఆరెల్లి వెంకటస్వామి, వింజయమూరి వెంకటేశ్వర్లు, పోతరాజు ప్రభాకర్, నన్నెం శెట్టి స్వామి, జన్ను రవీందర్, మేకల ఆనంద్, బస్కూరి శ్రీనివాస్, పెద్దమ్మ రామ్ నర్సింహులు, వేల్పుల సాంబయ్య, వేల్పుల సంపత్, గొర్రె కిరణ్ కుమార్, తాళ్ల మధు, బిగుల్ల సురేష్, పల్లెపు అనూష, కార్యకర్తలు, గొల్ల కురుమ సోదరులు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.