calender_icon.png 2 June, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిలో 8 మంది గల్లంతు

27-05-2025 01:07:38 AM

ఏపీలోని కోనసీమలో ఘటన

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): ఏపీలోని కోనసీమ జిల్లాలో ని గోదావరి నదిలో 8 మంది గల్లంతయ్యారు. ఏపీలోని కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం శేరులంక గ్రా మంలో ఓ శుభకార్యానికి కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామా ల నుంచి పలు కుటుంబాలవారు వ చ్చారు. అందులోని 11 మంది ము మ్మిడివరం మండలం కమిని లంక సమీపంలోని గోదావరిలో ఈత కోసమని వెళ్లారు.

నదిలో దిగి స్నానం చేస్తుండగా ఎనిమిది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో కాకినాడ కు చెందిన నలుగురు క్రాంతి(20), పాల్ (18), సాయి (18), సతీష్ (19), ఐ.పోలవరం మండలం ఎర్రగరువు గ్రామానికి చెందిన మహేశ్, రాజేశ్ (13), మండపేటకు చెందిన రోహిత్, శేరులంకకు చెందిన మహేష్లు ఉన్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు గోదావరిలో దిగి యువకుల కోసం వెతుకుతున్నారు.