03-02-2026 01:26:06 AM
‘యంగ్ లీడర్స్ డైలాగ్’కు తెలంగాణ
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్కు ఆహ్వానం
హైదరాబాద్, ఫిబ్రవ రి2 (విజయక్రాంతి): ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు శ్రీలంకలో జరిగే బే ఆఫ్ బెంగాల్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 కార్యక్రమానికి తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్ను ఆహ్వానించారు. డాక్టర్ కావింద జయవర్దేన (ఎంపీ, నీ గోం బో) ఆహ్వానం పంపించారు. కాన్రాడ్ -అడెనౌర్-స్టిఫ్టంగ్, శ్రీలంక యువ పార్లమెంటు సభ్యుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగనుంది. బ్లూ ఎకనామీ, క్లైమేట్ రెసిలియెన్స్, కోస్టల్ గవర్నెన్స్కు సంబంధించిన సవాళ్లు, అవకాశాలపై చర్చించేందుకు బే ఆఫ్ బెంగాల్ ప్రాంతానికి చెందిన యువ రాజకీయ నాయకులు, కొన్రాడ్ అడెనౌర్ స్కూల్ ఫోర్ యంగ్ పాలిటిషియన్స్, పూర్వ విద్యార్థులు, నిపుణులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రసంగిస్తారు.